తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీలలో కిలోల కొద్దీ బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టు లో సుమారు 1,381 కిలోల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వేపంపట్టులో బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని. విచారించగా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన బంగారంగా వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇందుకు సంబంధించిన గడువు తీరడంతో ఇక్కడ నుంచి ఆలయానికి తరలిస్తున్నామని వారు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు వెను వెంటనే టీటీడీ అధికారులను సంప్రదించగా, ఆ బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేయటంతో నిందుతులను అరెస్టు చేసారు.