కొంతకాలంగా సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్న సినీనటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. గత రెండు పర్యాయాలు బీజేపీ విజయం సాధిస్తూ వస్తోంది. అయితే ఈసారి ప్రకాశ్ రాజ్ ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి ఉండటంతో . కాంగ్రెస్, బీజేపీ, ప్రకాశ్ రాజ్ మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది..ప్రకాశ్ రాజ్ కారణంగా బీజేపీ ఓట్లు చీలిపోతాయని కాంగ్రెస్, కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయని బీజేపీ నేతలు భావిస్తున్నప్పటికీ విశ్లేషకులు మాత్రం ప్రకాశ్ రాజ్ పోటీ కారణంగా పరోక్షంగా బీజేపీ లాభపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
ఈనెల 18న జరిగే ఎన్నకలలో.సోషలిస్ట్ భావాలు కలిగిన ప్రకాశ్ రాజ్ మైనార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని... అది అంతిమం గా బీజేపీకి లాభం చేకూర్చే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. కాగాప్రకాశ్ రాజ్కు కాంగ్రెస్, జేడీఎస్లు మద్దతు ఇస్తాయనే వాదనలు వినిపించాయి. అయితే జేడీఎస్తో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్... తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాల్సి వచ్చింది.