ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కోసం తమిళనాడు సినిమా థియేటర్లు బంద్‌

national |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2019, 08:04 PM

తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీ గురువారం సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. ఎన్నికల కారణంగా తమిళనాడు థియేటర్ల సంఘం ఈ ప్రకటన చేసింది. ఉదయం,  మధ్యాహం రెండో షో లు క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. దేశంలో రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడు రాష్ట్రంలో 38 లోక్ సభ స్థానాలకు, 16 అసెంబ్లీ స్థానాలకు  ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ తమిళనాడు సినిమా థియేటర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం పూట షోలు మాత్రమే క్యాన్సిల్ చేస్తామని, ఈసారి మాత్రం మధ్యాహ్నం షో ని కూడా క్యాన్సిల్ చేశామని తమిళనాడు థియేటర్లు, మల్టిప్లెక్స్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్ తెలిపారు.  రెండు షో లు క్యాన్సిల్ చేయడంతో తమకు 25 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com