బీజేపీ సీనియర్ నాయకులైన శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్లాల్, ప్రభాత్ జాతో సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తాను బీజేపీలో చేరినట్లు సాధ్వి ప్రగ్యా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని.. తప్పకుండా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్పై సాధ్వి ప్రగ్యా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. భోపాల్లో 1989 నుంచి కాంగ్రెస్ గెలిచింది లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్ లోక్సభ నియోజకవర్గంలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలవగా, మిగతా ఐదు సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయితే మాలేగావ్ పేలుళ్ల ఘటనకు సంబంధించి 2008లో సాధ్వి ప్రగ్యాను అరెస్టు చేయడంతో ఆమె పేరు ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చింది. కాగా, మాలేగావ్ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇంకా ఆమెకు విముక్తి ప్రసాదించలేదు.