తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సోదరి.. కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 10 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోకవర్గం నుంచి కనిమొళి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆమె ఇక్కడే నివాసం ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడుతలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో 38 సీట్లలో ఈనెల 18న పోలింగ్ జరగనుంది. ఒక్క సీటు వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.