తమిళనాడులోని వెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలను రద్దు చేసినట్టు ఈ సి ప్రకటించింది..డిఎంకే నేతకు చెందిన సిమెంట్ గోదాముల్లో రూ.11.53 కోట్లు నగదు పట్టుబడింది. ఈరోజు ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు చేస్తుండగా సుమారు రూ.12 కోట్ల నగదు దొరికింది. ఇంత పెద్ద ఎత్తున నగదు పట్టుబడడంతో ఎన్నికలు రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈసీకి లేఖ రాయగా.... ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఈసీ నివేదించింది. ఈసీ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్రపతి వెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలను రద్దు చేస్తూ ఆమోదం తెలియజేయటంతో గురువారం జరగాల్సిన వెల్లూరు పార్లమెంటు స్థానం ఎన్నికలు రద్దయ్యాయి.