ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వల్లే ఆమెకు గుర్తింపు: కుమారస్వామి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 06:46 PM

బహుభాషా నటి సుమలతకు తన వల్లే ప్రజల్లో ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండ్యలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా వల్లే సుమలతకు ఈ గుర్తింపు వచ్చింది. ఆమె మండ్య మొత్తం తిరుగుతూ జేడీఎస్‌ పార్టీకి చెందినవారు దొంగలని ప్రచారం చేస్తుంది. మీలాంటి పుణ్యాత్ముల వల్లే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను. ఇంకెవరి వల్ల కాదు’ అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 


కాంగ్రెస్‌ నుంచి టికెట్ ఆశించిన సుమలతకు నిరాశ ఎదురుకావడంతో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ స్థానానికి మార్చి 20న నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మీద పోటీ పడుతున్నారు. కర్ణాటకలో ఏప్రిల్‌ 18, 23న రెండు, మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com