ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ ఎన్నికల‌కు సీపీఐ(ఎం) వినూత్న ప్ర‌చారం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 04:52 PM

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి మొద‌ల‌య్యింది. ఆ వేడికి మండుటెండలు తోడవడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ఓటర్లు మధ్యాహ్న సమయంలో ప్రచారం చేసేందుకు సంకోచిస్తున్నారు. కానీ సీపీఐ(ఎం) పార్టీ మాత్రం వినూత్నంగా ఆలోచించి మధురై(తమిళనాడు) ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఎండ తీవ్రత నుంచి ఓటర్లకు కాస్త ఉపశమనం కలిగించేందుకు గొడుగులను అందుబాటులోకి తెచ్చింది. గొడుగులపై పార్టీ గుర్తును ఏర్పాటు చేయడంతో ఎండ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా పార్టీ ప్రచారానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎరుపు రంగులో ఉన్న ఆ గొడుగులపైనే అందరి దృష్టి పడుతుంది అని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ గొడుగులు మా పార్టీ ప్రచారానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com