లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ముహుర్తం ఖరారైంది. వరుసగా రెండోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్న మోదీ.. ఈ నెల 26వ తేదీన తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. రెండు రోజుల పాటు వారణాసిలో ఆయన పర్యటించనున్నారు. 25వ తేదీన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్అశ్వమేథ్ ఘాట్ వరకు నిర్వహించే రోడ్షోలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం కాల భైరవ ఆలయానికి మోదీ వెళ్లనున్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో మోదీ సమావేశం కానున్నారు. 26న కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ. అక్కడ్నుంచి రోడ్ షో పాల్గొని అనంతరం మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు మోదీ.