నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 4.7గా నమోదు అయ్యింది. ఇవాళ ఉదయం 4.44 నిమిషాలకు ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఫిబ్రవరి 28న కూడా నికోబార్ దీవుల్లో 4.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. మార్చి 23వ తేదీన కూడా పది నిమిషాల వ్యవధిలోనే అండమాన్ దీవుల్లో 5.1 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.