పాకిస్థాన్ చెర నుంచి భారతదేశానికి చెందిన 100మంది జాలర్లను పాక్ విడుదల చేసింది. 17 నెలల క్రితం.. గుజరాత్ లోని వడోదరకు చెందిన జాలర్లు..చేపలు పడుతూ పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వీరిని పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కరాచీ జైలుకు తరలించి నిర్భంధించారు. అప్పటి నుంచి వారు ఏడాదిన్న కాలంగా పాక్ జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న విడుదలైన 100 మంది జాలర్లను విడుదల చేసారు.
ఏడాదిన్నర తరువాత జాలర్లను విడుదల చేసి ఏప్రిల్ 8న అట్టారీ -వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించారు. దీంతో వారు అమృత్సర్ మీదుగా వడోదరకు రైలు మార్గం గుండా గురువారం (ఏప్రిల్ 11) రాత్రి వడోదరకు చేరుకున్నారు.
కాగా ఇటీవల జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో దాడి..అనంతరం పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ వాయు సేన సర్జికల్ ఎటాక్స్ వంటి పలు కీలక పరిణామాల హద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా..తమను ఒక గదిలో బంధించారని విడుదల అయిన ఓ జాలరి తెలిపాడు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ఉద్దేశంతో..360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని ఏప్రిల్ 5వ తేదీన పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 100 మంది భారత జాలర్లను పాకిస్థాన్ విడుదల చేసిది.