ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భరణంతో నే ప్రపంచంలోనే మూడవ సంపన్న మహిళ మెకంజీ

international |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 11:02 PM

ఎక్కడైనా సరే భార్యభర్తలు విడిపోవాలనుకుంటే విడాకులు తీసుకుంటారు. అంతేకాదు విడాకుల తర్వాత భార్య బ్రతకడానికి భరణం క్రింద కొంత ఆస్తి లేదా డబ్బును చెల్లిస్తాడు భర్త. కాని ఇక్కడ భర్త ఇచ్చిన భరణంలో ఏకంగా ఆమె ప్రపంచంలోనే మూడవ సంపన్న మహిళగా మారనున్నారు. ఎవరు అనుకుంటున్నారా. అదేనండి అమెజాన్ సీఈవో బీజోస్ భార్య మెకంజీ. ప్రపంచ సంపన్నుడు జెఫ్ బీజోస్ ఇప్పుడు తన భార్యతో విడిపోవాలని అనుకుంటున్నాడు. అంతేకాదు భరణంగా ఆమెకు 3500 కోట్ల డాల‌ర్లు స‌మ‌ర్పించ‌నున్నాడు. అంతేకాదు అమెజాన్ సంస్థలోని నాలుగు శాతం షేర్లను భార్య మెకంజీకి ఇవ్వనున్నట్లు..జూలై చివ‌రి లోగా ఈ మొత్తాన్ని అందించ‌నున్నట్లు బీజోస్ తెలిపారు. కాగా ప్రస్తుతం బీజోస్‌, మెకంజీ జంట విడాకులు తీసుకునే ప్రక్రియ‌లో ఉన్నారు. జెఫ్ బీజోస్ త‌న భార్యకు భారీ భ‌ర‌ణం స‌మ‌ర్పించుకున్నా.. త‌న ఆస్తుల‌కు మాత్రం కొడ‌వ రావ‌డం లేదు. విడాకుల కింద 3500 కోట్ల డాల‌ర్లు ఇచ్చినా.. జెఫ్ బీజోస్ ప్రపంచ ప్రథ‌మ సంప‌న్నుడిగానే ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com