అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాలకు అహ్మదాబాద్ మెట్రో కోర్టు ఒక పరువునష్టం కేసులో నోటీసులు జారీ చేసింది. అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకు దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్, సుర్జేవాలా ఇద్దరూ మే 27వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అహ్మదాబాద్ మెట్రో కోర్టు నోటీసులో పేర్కొంది.