ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ యుద్దానికి సిద్దం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2019, 10:08 PM


భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ(MEA) తెలిపింది.భారత్ లో ఉగ్రదాడులకు సిద్దమవ్వాలని పాక్ కు చెందిన ఉగ్రవాదులకు పిలుపునిస్తున్నట్లు ఈ పబ్లిక్ జిమ్మిక్కు సృష్టంగా తెలియజేస్తుందని భారత్ తెలిపింది. పాక్ టెర్రరిస్టు దాడుల గురించి తీసుకునే చర్యలు,క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ షేర్ చేసేందుకు ఏర్పాటు చేసిన దౌత్య మరియు DGMO చానెళ్లను ఉపయోగించాలని పాక్ కు సూచించినట్లు తెలిపింది. సరిహద్దులు దాటి తీవ్రవాదులపై దాడి చేసే హక్కు భారత్ కు ఉందని తెలిపింది. పాక్ పై భారత్‌ కొత్త దాడికి పథకం రచిస్తోందని,తమకు అందిన సమచారం మేరకు ఏప్రిల్‌ 16-20వ తేదీ మధ్యలో ఆ దాడి జరిగే అవకాశముందని,నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com