తిరుపతి వైసీపీ అభ్యర్థి కరుణాకరరెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతితో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ రాయలసీమలో కొందరు నేతలు వాళ్ళు మాత్రమే పాలించడానికి పుట్టారని.. మిగతా వాళ్ళు వాళ్ళకి పడిఉండాలని అనుకుంటారని.. ఇప్పటికీ దళితులను కొంతమంది వాళ్ళ వీధుల మీదగా వెళ్తుంటే చెప్పులు ధరించకూడదని.. వీళ్లా మనల్ని పాలించేది ప్రశ్నించారు. 2009లో ఇక్కడ చిరంజీవిని నానాతిప్పలు పెట్టారని.. అయితే ఇది 2009 కాదు.. తాను చిరంజీవి అంత మంచివాడిని కూడా కాదని.. కరుణాకరరెడ్డి ఇష్టం వచ్చినట్లు చేస్తా.. ఇష్టం వచ్చినట్లు తిడతా అంటూ నారతీసి కూర్చోబెడతామన్నారు. టీటీడీ చైర్మన్ గా కూడా చేసిన కరుణాకరరెడ్డి ఎన్ని నగలు పోయాయో ఎక్కడకి వెళ్ళాయో లెక్కలు ఎవరికీ చెప్పలేదని.. వీళ్ళ భాగోతం అందరికీ తెలుసనీ.. మమ్మల్ని, జనసైనికులను ఇబ్బంది పెడితే మాత్రం తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందన్నారు.