ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 గంటల్లో 9 భూకంపాలు

international |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2019, 02:27 PM

ఏం జరుగుతుంది.. ప్రళయానికి ఇది సంకేతమా.. విపత్తుకు ముందు వచ్చే అలర్టా.. భూమి లోపల ఏం జరుగుతుంది.. ఎందుకు ఇలా జరిగింది.. కేవలం 120 నిమిషాలు.. అంటే 2 గంటల్లో 9 భూకంపాలు వచ్చాయి.. ఎక్కడో కాదు.. మన అండమాన్ నికోబర్ దీవుల్లో. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రకంపనలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ తొమ్మిది భూకంపాలు కూడా భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించాయి. 


భూకంపం టైమ్ - తీవ్రత 


మొదటి భూకంపం : ఉదయం 5.14 గంటలకు 4.9 తీవ్రత


రెండో భూకంపం : ఉదయం 5.519 గంటలకు 5 తీవ్రత


మూడో భూకంపం : ఉదయం 5.33 గంటలకు 5 తీవ్రత


నాలుగో భూకంపం : ఉదయం 5.34 గంటలకు 4.8 తీవ్రత


ఐదో భూకంపం : ఉదయం 6.04 గంటలకు 4.8 తీవ్రత


ఆరో భూకంపం : ఉదయం 6.19 గంటలకు 4.8 తీవ్రత


ఏడో భూకంపం : ఉదయం 6.28 గంటలకు 4.8 తీవ్రత


ఎనిమిదో భూకంపం : ఉదయం 6.41 గంటలకు 5.2 తీవ్రత


తొమ్మిదో భూకంపం : ఉదయం 6.54 గంటలకు 5.2 తీవ్రత


అండమాన్ నికోబర్ దీవుల్లో ఇలాంటి ప్రకంపనలు సహజమే అయినా.. అవి ఒకటి, రెండు, మూడు వరకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు భిన్నంగా రెండు గంటల్లో 9 భూకంపాలు రావటం అనేది మాత్రం ఇదే అంటున్నారు. ఈ భూకంపాలతో అండమాన్ లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టంపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com