ఆధార్తో పాన్ను అనుసంధానం చేసుకోవడానికి గడువును ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకునే గడువును పొడిగించారు. ప్రజలు తమ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి గడువును పొడిగించడం ఇది ఆరవసారి. గత జూన్ నెలలో ఆధార్తో పాన్ను అనుసంధానం చేసుకోవడానికి గడువును 2019 మార్చి 31 వరకూ పొడిగించారు. నిన్నటితో గడువు ముగియడంతో దీనిని తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) అధికారులు తెలిపారు. కాగా నేటినుంచి ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్ తప్పనిసరి అని వారన్నారు.