ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము గూఢచర్యం చేయలేదు: అమెరికా

international |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2019, 02:17 PM

భారత్‌ యాంటీ శాటిలైట్‌ ప్రయోగం నిర్వహించినప్పుడు అమెరికాకు ఎటువంటి గూఢచర్యం నిర్వహించలేదని పెంటగాన్‌ పేర్కొంది. ఈ ప్రయోగం తర్వాత డిగోగార్సియా స్థావరం నుంచి అమెరికా విమానం ఒకటి బంగాళఖాతంలోకి ప్రవేశించింది. దీనిపై పెంటగాన్‌ వివరణ ఇస్తూ భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసని పేర్కొంది. ‘‘అమెరికాకు చెందిన ఏ పరికరాలు భారత్‌పై నిఘా వేయలేదు. వాస్తవానికి అమెరికా భారత్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. భారత్‌తో సైనిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం. ’’ అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి  లెఫ్టినెంట్‌ కల్నల్‌ డేవిడ్‌ డబ్ల్యూ ఈస్ట్‌బార్న్‌ వెల్లడించారు. 


 అమెరికా విమానం భారత్‌పై నిఘా వేసిందని వచ్చే వార్తలతో ఇరు దేశాల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడదని విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com