కొవ్వూరు: నందమూరి తారకరామారావు తెలుగు జాతికి ఇచ్చిన కానుకే తెలుగుదేశం పార్టీ అన్నారు సీఎం చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు ఎన్టీఆర్ చొరవవలనే 37 సంవత్సరాల క్రితం టీడీపీ ఆవిర్భవించిందని .. ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. మనిషిని మనిషిగా గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ గారని.. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆనాడు పార్టీ ఆవిర్భవించిందని.. ఆయన ఆశయాల నుండి పార్టీలో ఆయన ఆశయాలను కొనసాగించడమే ఇప్పుడు మా ఉదేశ్యమని.. ఈనాడు తినడానికి కొదువ లేకుండా ఇంట్లో ఉన్నా లేకుండా అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్సుతున్నామన్నారు. గత ఐదేళ్లలోనే పదిలక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసి ఇప్పటికే యాభై శాతం ఇల్లు ప్రారంభం కూడా అయ్యాయన్నారు. మహిళలకు సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇచ్చి ఆత్మగౌరం పెంచుతున్నామన్నారు.