ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు ఆరువారాల పాటు బెయిల్ మంజూరు చేసేందుకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు అంగీకరిచింది. దేశంలో ఎక్కడైనా ఆయన వైద్య చికిత్స తీసుకునేందుకు అనుమతించింది. వైద్య కారణాల కింద పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని తిసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయించినట్టు స్థానిక దినపత్రిక ‘డాన్’ వెల్లడించింది. వైద్య చికిత్స పూర్తైన తర్వాత నవాజ్ షరీఫ్ మళ్లీ కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంటుంది. ఓ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్కు ఏడేళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే.