తుఫాన్, వరదల ధాటికి ఆఫ్రికా అతలాకుతలం అవుతోంది. ప్రకృతి బీభత్సానికి ఆఫ్రికాలోని దక్షిణాది ప్రాంతంలో ఇప్పటికే 700 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక్క మొజాంబిక్ లోనే 417 మంది చనిపోగా.. జింబాబ్వేలో 259 మంది, మాలావిలో 56మంది చనిపోయినట్టు సమాచారం.అలాగే వేలాదిమంది ప్రజలు చెట్ల పైనా.. ఇంటి పైకప్పుల పైనా కూర్చొని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మొజాంబిక్, జింబాబ్వే, మాలవిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.మూడు దేశాల్లో మొత్తం 20 లక్షల పైచిలుకు ప్రజలు వరదల బారిన పడినట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 1500 మంది వరదల్లో అత్యవసర సహాయం కోసం ఎదురుచూస్తున్నారని మొజాంబిక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.