బీజింగ్ : చైనాలో ఒక కారు భీభత్సం సృష్టించింది. సెంట్రల్ చైనాలో జన సమూహంపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కారు డ్రైవర్పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. సెంట్రల్ చైనా హుబీ ప్రొవిన్స్లోని జావోయాంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో చైనాలో ఇటువంటి ఘటనలు జరగడం సాధారణమైపోయింది.