గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మందికి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్రప్రదేశ్ నుండి టీటీడీ జెఈవో లక్ష్మికాంతంకు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి. లక్ష్మికాంతం విజయవాడ కలెక్టర్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఫలాలను పేదలకు అందించడంలో ముందంజలో నిలిచారు. భారతదేశం నుండి అతి కొద్దిమందికి ఈ ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా లక్ష్మీకాంతంకు అరుదైన అవకాశం రావడం అభినందనీయమని యూఏఈలో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసీకుమార్లు అభినందించారు.