బెంగుళూరు: లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్.. వైమానిక దళంలోకి వచ్చేసింది. ఎల్సీఏ తేజస్ ఫైటర్ జెట్ను దేశీయంగా నిర్మించారు. ఈ యుద్ధ విమానాన్ని ఇక వైమానిక దళం తన విధుల్లో వినియోగించనున్నది. బెంగుళూరులో జరుగుతున్న ఎయిర్షోలో తేజస్ను ప్రదర్శించారు. ఇవాళ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. యుద్ధ విమానం తేజస్లో విహరించారు. కోపైలట్గా ఆయన ఆ విమానంలో పైకి ఎగిరారు. భారతీయ వైమానిక దళానికి ఈ విమానాన్ని సెమిలాక్ సంస్థ ఇటీవలే అప్పగించింది. పూర్తి స్థాయిలో ఆపరేషనల్ క్లియరెన్స్ వచ్చేసింది. ఆపరేషనల్ క్లియరెన్స్ దక్కడం ఓ మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా తెలిపారు. తాజాగా పోక్రాన్లో జరిగిన వాయుశక్తి ప్రదర్శనలో తేజస్ను ప్రదర్శించారు. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ రిఫ్యుయలింగ్ విన్యాసాలను తేజస్ విజయవంతంగా నిర్వహించిందని ఎయిర్ చీఫ్ తెలిపారు.