బలహీన వర్గాలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ…. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… విభజన చట్టంలోని అంశాలు ఏ ఒక్కటీ పూర్తిగా పరిష్కరించలేదన్నారు. రాజకీయంగా ఏపీకి అన్యాయం చేయాలని జగన్, కేసీఆర్, మోడీ కుమ్మక్కయ్యారన్నారు. ఎవరెన్ని బెదిరింపులు చేసినా భయపడేవారు లేరన్నారు. రాష్ట్రాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తండ్రి అధికారంలో ఉండగా రూ.లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా అధికారంలోకి రావడానికి జగన్ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.