ఢాకా: బంగ్లాదేశ్ రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 45 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో 45 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఢాకాలోని చౌక్బజార్ అపార్ట్మెంట్లోని రసాయనాల గోదాములో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ అంతటా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ప్రక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు అంటుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ అగ్నిమాపక చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. మొత్తం 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.