ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్‌పై రాళ్ళ దాడి.. ఇది మూడోసారి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 10:35 PM

మన దేశ సాంకేతికతతో చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేసిన వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్‌ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రైలుగా ఈ ట్రైన్ గుర్తింపు పొందింది. అయితే ‘వందే భారత్‌’ పై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక విండో గ్లాస్‌ పగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ట్రైన్‌ కాన్పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కాగా, ట్రయల్‌ రన్‌ సందర్భంగా వందే భారత్‌పై గతంలో కూడా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడికి దిగిన దాఖలాలున్నాయి.
డిసెంబర్‌ 20, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఇదిలాఉండగా.. ప్రధాని చేతుల మీదుగా ఢిల్లీలో గత శుక్రవారం ప్రారంభమైన వందే భారత్‌కు ఆదిలోనే సమస్యలు ఏర్పడ్డాయి. ప్రారంభమైన మొదటి రోజున ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్‌ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్‌ కుమార్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com