అమరావతి: పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. పార్టీలో వలసలు, చేరికలపై దృష్టి పెట్టడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చిస్తున్నారు. జెండా పండుగ నిర్వాహణకు ప్రణాళికలు టీడీపీ సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోన్న ఏపీ రాజకీయ పరిణామాలపై టీడీపీ ఫోకస్ పెట్టింది.