జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడితో... యావత్దేశ ప్రజలు పాకిస్తాన్పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇదే సమయంలో హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా భారత్ తరపున వాదనలు వినిపించిన హరీశ్ పాల్వే.. పాకిస్తాన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పాక్ మిలిటరీ కోర్టు కులభూషణ్ జాదవ్కు మరణశిక్ష విధించడం వియన్నా ఒప్పందం ప్రకారం సరికాదన్నారు. అసలా కోర్టులో నిబంధనలకు అనుగుణంగా వాదనలే జరగవన్నారు. వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉందన్నారు. జాదవ్ను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్తాన్.. అందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటివరకూ బయటపెట్టలేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు సంప్రదించినా.. జాదవ్కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదని చెప్పారు. 4రోజుల పాటు జరగనున్న విచారణలో భాగంగా.. ఈనెల 19న పాకిస్తాన్ తన వాదనలు వినిపించనుంది
2016లో కుల్భూషణ్ జాదవ్ను బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ అదుపులోకి చేసింది. అతను పాకిస్తాన్లో గూఢచర్యం చేసినట్టు ఆరోపిస్తూ కేసులు నమోదు చేసింది. అతనికి పాకిస్తాన్ మిలిటరీ కోర్టు.. మరణ శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది ఇండియా. పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.