మాజీ క్రికెటర్, బీజీపీ మాజీ నేత కీర్తీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆజాద్కు పార్టీ కండువా కప్పి రాహుల్ ఆహ్వానించారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆజాద్.. బిహార్లోని దర్బాంగ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లిపై తీవ్ర విమర్శలు చేసినందున గతంలో బీజేపీ.. ఆజాద్ను సస్పెండ్ చేసింది.