జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు బలయ్యారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం అయ్యో పాపం అంటోంది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తోంది. అయితే కొందరు దేశద్రోహులు మాత్రం ఈ ఘటనపై సంబరాలు చేసుకున్నారు. అదీ భారతీయులే అవడం సిగ్గూచేటు. జవాన్ల ఆకస్మిక మరణంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నిండుకుంది. వారి బాధ ఎవ్వరూ తీర్చలేరు. దేశం నలుమూలల నుంచి వారిపై సానుభూతి, ఉగ్రవాద చర్యలపై ఆక్రోషం వెల్లువెత్తుతుంటే జైపూర్లోని నిమ్స్ యూనివర్శిటీలో చదువుతున్న నలుగురు కాశ్మీరీ అమ్మాయిలు (తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్ర నజీర్, ఉజ్మా నజీర్) ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్నారు.
దాడిని స్వాగతిస్తూ పార్టీ చేసుకున్నారు. ఫోటో తీసి.. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్ స్టేటస్ పెట్టారు.ఆ ఫోటో కాస్త వైరల్గా మారడంతో దొరికిపోయారు. వ్యవహారం వర్శిటీ అధికారుల దగ్గరకు చేరింది. వర్సిటీ యాజమాన్యం, విద్యార్థుల దుశ్చర్యపై భగ్గుమన్నారు. ఆ నలుగురు విద్యార్థినిల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నలుగురు విద్యార్థినిలు వర్శిటీ నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.