ప్రముఖ నటుడు రజనీకాంత్ వచ్చే లోక సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టంగా ప్రకటించారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేస్తామని తెలిపారు. రజనీకాంత్ ఒక్కసారి ప్లేట్ ఫిరాయించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ పేరును ప్రకటించకపోయినా రజినీ మక్కల్ మండ్రం పేరుతోనే అభిమానులు, కార్యకర్తలు రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎవరికీ మద్దతు ఇవ్వబోమని రజినీ చెప్పారు. తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.