అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ పార్టీ మారనని టీడీపీ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దన్నారు. తాను ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నా ఓకేనన్నారు. కొందరి కోసం మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనన్నారు. బీసీ గర్జన పెట్టేందుకు జగన్ అనర్హుడన్నారు.