తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ అధ్యక్షతన ఆగమ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఈవో శ్రీకెఎస్.శ్రీనివాసరాజు, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీఎన్ఎకె.సుందర వదనాచార్యులు, శ్రీ ఎ.వేణుగోపాలదీక్షితులు, శ్రీ ఎన్వి.మోహనరంగాచార్యులు, శ్రీ ఎటి.అనంత దీక్షితులు, శ్రీపిఎస్ఎస్ఆర్.జగన్నాథా చార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆగమ సలహాదారులు పలు సూచనలు చేశారు.
- తిరుమల శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయడం. వైఖానస ఆగమాన్ని పాటించే ఇతర ఆలయాలకు ఉపయోగపడేలా దేవనాగరి లిపి నుండి తెలుగులోకి అనువదించడం.
- శ్రీవారి పుష్కరిణి వద్ద రథమండపం నిర్మించడం.
- తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాకుంభాభిషేకాన్ని ఏప్రిల్ 22 నుండి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తారు.