ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిటిడి ఆగమ సలహా మండలి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 08:12 PM

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధ్యక్షతన ఆగమ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీఎన్‌ఎకె.సుందర వదనాచార్యులు, శ్రీ ఎ.వేణుగోపాలదీక్షితులు, శ్రీ ఎన్‌వి.మోహనరంగాచార్యులు, శ్రీ ఎటి.అనంత దీక్షితులు, శ్రీపిఎస్‌ఎస్‌ఆర్‌.జగన్నాథా చార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆగమ సలహాదారులు పలు సూచనలు చేశారు.
- తిరుమల శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయడం. వైఖానస ఆగమాన్ని పాటించే ఇతర ఆలయాలకు ఉపయోగపడేలా దేవనాగరి లిపి నుండి తెలుగులోకి అనువదించడం.
- శ్రీవారి పుష్కరిణి వద్ద రథమండపం నిర్మించడం.
- తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాకుంభాభిషేకాన్ని ఏప్రిల్‌ 22 నుండి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com