న్యూఢిల్లి : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో నిందితుడు క్రిస్టియన్ మైకేల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లి కోర్టు తిరస్కరించింది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు మైకేల్పై నమోదు చేసిన కేసులకు సంబంధించి మైకేల్ను గత డిసెంబర్ 22న ఇ.డి. అధికారులు అరెస్టు చేశారు. మైకేల్ బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ తిరస్కరించారు.