అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… బీజేపీ, కేసీఆర్ అండతో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయన్నారు. పార్టీలు మారడం తప్పులేదు… అంతకు ముందున్న పార్టీపై బురదజల్లడం మానుకోవాలన్నారు. హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ జై రమేశ్ మాపై రాళ్లు వేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో జై రమేశ్ అనేకరకాలుగా లబ్ధి పొందారన్నారు. అవినీతి రాజకీయాలు రాష్ట్రంలో కుదరదన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులు రూ.100కోట్లు ఖర్చుకు సిద్దమయ్యారు.