సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక రోజు ఆలస్యంగా పాకిస్తాన్లో పర్యటించనున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం యువరాజు శనివారం ఇస్లామాబాద్కు చేరుకోవాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు ఆలస్యంగా ఆయన ఆదివారం పాకిస్తాన్కు చేరుకుంటారని విదేశీ కార్యాలయం వెల్లడించింది. అయితే ఆలస్యానికి గల కారణాలు ప్రకటించలేదు. ఈ పర్యటన సమయంలో పది నుండి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయని ప్రధానమంత్రి సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్ వెల్లడించారు. ఈ జాబితాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని పాకిస్తాన్లో ఏర్పాటు చేసే ఒప్పందం కూడా ఉన్నట్లు తెలిపారు. యువరాజు పర్యటన నిమిత్తం విస్తృతమైన భద్రతా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.