ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీకి వ్య‌తిరేకంగా మ‌ల్లాడి నిర‌స‌న‌లు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 01:41 AM

గత మూడు రోజులుగా గవర్నర్ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించే తీరుపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గ బృందం చేపట్టిన నిరసనలు, ధర్నా మూడు రోజులుగా కొనసాగుతున్నాయి .ఈ నేపథ్యంలో శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ దత్ పుదుచ్చేరి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం తో గవర్నర్ బంగ్లా రాజ్ నివాస్ ప్రాంతం ఉగ్రతకు దారితీసింది .ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా గవర్నర్ కిరణ్ బేడీ బిజెపి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ పుదుచ్చేరి రాష్ట్రంలో ఇటువంటి అభివృద్ధి పనులు జరక్కుండా అడ్డుపడుతూ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా హరిస్తున్నారని అందువలన పుదుచ్చేరి ప్రజలు మంత్రివర్గం కిరణ్ బేడి తీరుపై విసుక చెంది ఈ నిరసనలకు ,ధర్నాకు దారి తీసాయి అన్నారు .అందువలన గవర్నర్ కిరణ్ బేడీని పుదుచ్చేరి గవర్నర్గా తొలగించాలన్నారు .డిమాండ్లు అన్ని యు నెరవేరేవరకు ఈ నిరసనలు కొనసాగుతాయి అన్నారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ,మంత్రివర్గ బృందం ,శాసనసభ్యులు ,కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com