ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరవీరుడి శవపేటిక మోసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 01:21 AM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న జవాన్లకు దేశం ఘనంగా నివాళి అర్పిస్తోంది. శత్రుదేశంపై, ముష్కర మూకలపై జనం భగ్గుమంటున్నారు. అమరులకు ప్రభుత్వం పూర్తి అధికార లాంఛనాలతో తుడి వీడ్కోలు పలుకుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓ అమరుడి శవపేటికను స్వయంగా భుజానికెత్తుకుని మోశారు. శుక్రవారం ఆయన రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆర్మీ నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తదితరులతో కసి  బుద్గాంలో అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత ఓ సైనికుడి రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్ మోశారు. చనిపోయిన వారి త్యాగాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదని తర్వాత హోం మంత్రి ట్వీట్‌ చేశారు. నివాళి కార్యక్రమం ముగిశాక గవర్నర్‌, హోం మంత్రి, ఆర్మీ అధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలను సమీక్షించారు. మరోపక్క పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 49కి చేరింది. దాడికి గట్టి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ప్ర‌ధాని మోదీ హెచ్చరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com