దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల యావత్ దేశం కీర్తిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సైనికులకు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ నివాళి అర్పించింది. ఇండోర్లోని సెజ్ యూనివర్సిటీలో జరుగుతున్న వరల్డ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాంగ్రెస్కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా కొవ్వొత్తి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది ఐశ్వర్య.