పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ నివాళి అర్పించారు. ఓ జవాన్ పార్థివదేహాన్ని ఉంచిన శవపేటికను తమ భుజాలపై మోసుకొని వెళ్లారు. అనంతరం సీఆర్పీఎఫ్ క్యాంప్లో అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా 'వీరజవాన్ అమర్ రహే' నినాదాలు ప్రతిధ్వనించాయి.