లోక్సభ ఎన్నికల నిర్వహణ తేదీలను మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తమవుతోంది. ఈ విడత ఎన్నికలు 9 దశల్లో జరగనున్నాయి. తేదీలను వచ్చే నెల 4 (మహా శివరాత్రి) తర్వాత ఎప్పుడైనా ఈసీ ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈనెల 28లోగా అన్ని ప్రధాన నిర్ణయాలను అమలు చేయాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం తమకు సూచించినట్లు ఐదుగురు కేంద్ర మంత్రులు సైతం అంగీకరించారు. మార్చి 8 నాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని వారు సంకేతాలిచ్చారు.