ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ‌ర‌వీరుడిని భుజాల‌పై మోసిన రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 03:51 PM

 పుల్వామా దాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు. పార్థివ‌దేహాల‌కు పుష్ప‌నివాళి అర్పించిన త‌ర్వాత రాజ్‌నాథ్‌.. అమ‌ర‌వీరుడి శ‌వ‌పేటిక‌ను మోసారు. జ‌మ్మూక‌శ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్‌తో పాటు రాజ్‌నాథ్ .. ఓ జ‌వాన శ‌వ‌పేటికను త‌మ భుజాల‌పై మోసుకెళ్లారు. పుల్వామా దాడిలో మొత్తం 49 మంది జ‌వాన్లు మృతిచెందారు. దాడికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని కూడా ప్ర‌ధాని అన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌.. బుద్గామ్ చేరుకున్నారు. ఆ త‌ర్వాత మృతుల‌కు నివాళి అర్పించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com