ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్ర‌దాడిని ఖండించిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 12:30 PM

పుల్వామా ఘటన విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. పుల్వామా దాడిని రాజకీయం చేయవద్దని, విపక్షాలన్నీ సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన కాసేపటికే రాహుల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలాంటి వివాదం చేయదలుచుకోలేదని.. కేంద్రానికి, జవాన్ల కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. 


మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. రాహుల్ చెప్పినట్టు పుల్వామా ఘటనపై ఎవరూ వివాదం చేయవద్దని, జవాన్ల కుటుంబాలకు మనమంతా అండగా ఉన్నామని చెప్పాల్సిన సందర్భం అని అన్నారు. తీవ్రవాద శక్తులతో పోరాటంలో కాంగ్రెస్ రాజీ ధోరణితో వ్యవహరించదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com