గుజరాత్ లోని వల్సాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. తన వద్దకు వస్తున్న వారిని చూసి రాహుల్ లేచి నిల్చున్నారు. ఇంతలో ఓ మహిళ రాహుల్ ను దగ్గరకు లాగి, అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత కూడా ఆయన గడ్డాన్ని పట్టుకుని ఆప్యాయతను కురిపించింది. ఈ సందర్భంగా, రాహుల్ కూడా నవ్వుతూ ఉండిపోయారు.