లండన్ : తాను చెల్లిస్తాననే సొమ్ము తీసుకోవాలని బ్యాంకులను ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించరని మద్యం వ్యాపారి, బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయిలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా ప్రశ్నించారు. తాను రుణంగా తీసుకున్న అసలు మొత్తాన్ని చెల్లిస్తానని మాల్యా బ్యాంకులకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో బ్యాంకులను ఎందుకు ఆదేశించరని తాను వినయపూర్వకంగా అడుగుతున్నానని, కింగ్ఫిషర్కు ఇచ్చిన రుణాలు మొత్తం తిరిగి వచ్చాయనే క్రెడిట్ ఆయన తీసుకోవచ్చు కదా అని మాల్యా ట్వీట్ చేశారు.