దుబాయ్... ప్రపంచంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. నిత్యం వేలాది మంది దూబాయ్ వెళ్తుంటారు. అక్కడి నిర్మాణాలు చూసి ఆశ్చర్యపోతుంటారు.దుబాయ్లో నౌకా విహారం టూరిస్టుల ఫేవరెట్. అక్కడికి విహారయాత్రలకు వెళ్లేవాళ్లు ఖచ్చితంగా బోటులో షికార్లు చేస్తుంటారు.సముద్ర మార్గంలో వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ సంస్థ అయిన carrefour సముద్రం మధ్యలో ఓ సూపర్ మార్కెట్ ప్రారంభించింది.మీ స్మార్ట్ఫోన్లోనే సరుకులు ఆర్డర్ చేయొచ్చు. ఆ స్టోర్కు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు.ఆర్డర్ అందుకోగానే స్టోర్ సిబ్బంది సరుకులు ప్యాక్ చేసి సిద్ధంగా ఉంటారు. మీ బోటు దగ్గరకు రాగానే మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ డెలివరీ చేస్తారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడిచే ఈ సూపర్ మార్కెట్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.ఫ్లోటింగ్ సూపర్ మార్కెట్లో 300 పైగా ఉత్పత్తులు, ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి.కేవలం సరుకులు అమ్మడం మాత్రమే కాదు... సముద్రంలో తేలే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వ్యవస్థ కూడా ఉంది