అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా నుంచి యూఎస్కు ఎగుమతి అవుతున్న విస్కీపై అమెరికా ప్రభుత్వం టాక్స్ వసూలు చేయడం లేదని, భారత్ మాత్రం అమెరికా నుంచి భారత్కు ఎగుమతి చేస్తున్న విస్కీపై 150శాతం టాక్స్ విధిస్తోందని విమర్శించారు. ట్రంప్ భారత్ను విమర్శించడం ఇతితొలిసారి కాదు.. గతంలో భారత్ ‘టారిఫ్ కింగ్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి వరల్డ్ బ్యాంక్ అధికారులు ఘాటు సమాధానం ఇచ్చారు. అయితే యూఎస్ ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ద్వారా అమెరికా దేశం నుంచి ప్రయోజనాలను పొందుతున్న వారికి అడ్డుకట్ట వేసి, 800 బిలియన్ డాలర్లు వాణిజ్య లోటు సమస్య తీరుతుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇలానే వసూలు చేస్తున్నాయని వరల్డ్ టారిఫ్ ప్రొఫైల్స్ 2018 లెక్కల్లో తేలింది.. జపాన్ 736 శాతం, కొరియా 807 శాతం, అమెరికా 350 శాతం, ఆస్ట్రేలియా 163 శాతం, ఇండియా 150 శాతం దిగుమతి టాక్స్ వసూలు చేస్తున్నాయి.