రాష్ట్రంలోని బాలికలు, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోమ్ మంత్రి అనిత.. తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని మాజీ మంత్రి ఆర్కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాల్టీషోలు, షూటింగ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే, రాజకీయాల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు నెలల్లో బాలికలు, మహిళలపై దాదాపు 120 దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయంటే, వారి రక్షణ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవాలని రోజా అన్నారు.