ఈ నెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరగాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. వైఎస్.జగన్ సోదరి, షర్మిల, బావ అనిల్ కుమార్ లు అనారోగ్యం బారిన పడటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ గృహప్రవేశ కార్యక్రమం తిరిగి ఎప్పుడు జరిగేదీ త్వరలో తెలియజేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే తాడేపల్లిలో వైఎస్.జగన్మోహనరెడ్డి నూతనంగా నివాస భవనం అందులోనే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నూతన భవనంలోకి ఈ నెల 14వ తేదీన గృహప్రవేశం చేసి మకాం అమరావతికి మార్చాలని ముందుగా నిర్ణయించారు. అయితే సోదరి కుటుంబం జర్వరంతో బాధపడుతున్నందున తన నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని జగన్మోహనరెడ్డి వాయిదా వేసుకున్నారు.